సినీ ప్రముఖుల సమక్షంలో మార్చి 26న ఈడోరకం-ఆడోరకం ఆడియో విడుదల

మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఈడోరకం-ఆడోరకం. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 26న విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top