వక్కంతం వంశీతో యంగ్ టైగర్ సినిమా కన్ఫర్మ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మూడేళ్లుగా ఎదురుచూస్తోన్న వక్కంతం వంశీకి తన నెక్ట్స్ సినిమాకు దర్శకుడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలోనే వంశీ ఎన్టీఆర్‌ను కలిసినా అది కార్యరూపం దాల్చలేదు. వంశీ రాసిన టెంపర్ స్టోరీతో పూరీ దర్శకుడిగా సినిమా చేశాడు. ఇక తర్వాత ‘నాన్న‌కు ప్రేమ‌తో’ దాని తర్వాత ‘జ‌న‌తా గ్యారేజ్’ సినిమాలో ఇంకా బిజీగానే ఉన్నాడు.

ఇక వంశీతో ఎన్టీఆర్ సినిమా ఉండేలా లేదని, ఎన్టీఆర్ పక్కన పెట్టేశాడని అంతా అనుకుంటున్న టైంలో ఎన్టీఆర్ ‘జ‌న‌తా గ్యారేజ్’ త‌ర‌వాత వ‌క్కంతం దర్శకత్వంలో సినిమాను ఓకే చెసినట్లు తెలుస్తోంది. ‘జ‌న‌తా గ్యారేజ్’ పూర్తి కాగానే ఎన్టీఆర్, వంశీ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించబోతునట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏదైనా ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నారని వంశీ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారట.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top