రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో విశేషం 
కందుకూరు: భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు ఓవైపు సొమ్మసిల్లిపోతుంటే.. మరోవైపు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధి రాచలూరు, లేమూరు, కందుకూరు, మకాన్‌ తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం ఓ మోస్తరు వాన కురిసింది. మామూలుగా అయితే అదో పెద్ద విశేషం కాదు. కానీ.. ఆ ఊళ్లల్లో 95 ఏళ్లుగా ఇలా ఏటా శ్రీరామనవమి ముందురోజు వర్షం కురుస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా ఆనవాయితీ కురిసింది. దీంతో.. ఆ శ్రీరామచంద్రుడి కృప తమపై ఉందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వెలిబుచ్చారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top