బంజారాహిల్స్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ముగ్గురు డిస్ర్టిబ్యూటర్లు దాడిచేశారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ పూరీ శనివా రం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేశా రు. 3 నెలల క్రితం పూరీ జగన్నాథ్‌ దర్శకుడి గా నిర్మాత సి కళ్యాణ్‌ లోఫర్‌ అనే సినిమా తీశారు. ఈ సినిమా నైజాం, ఆంధ్రా, సీడెడ్‌ పంపిణీ హక్కులను డిస్ర్టిబ్యూటర్లు అభిషేక్‌, సుధీర్‌, ముత్యాల రాందా స్‌ తీసుకున్నారు. అయితే బాక్సాఫీసు వద్ద సినిమా బోల్తా కొట్టడంతో డిస్ర్టిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటూ వారు జగన్నాథ్‌ను కలిశారు. సినిమాకు నిర్మాతను కానని పూరీ చెప్పినా వినిపించుకోలేదు. ఈ నెల 14న వారు ఆయనపై దాడిచేశారు. ఆయన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top