చీరాల: ఓ హెడ్ కానిస్టేబుల్ తన సహోద్యోగితో కలిసి బస్‌ ఎక్కాడు. కొంత దూరం వెళ్లాక చూస్తే తన భార్య బస్సులో కనిపించింది. వెంటనే ఆగ్రహంతో రగిలిపోయాడా హెడ్ కానిస్టేబుల్.. కత్తితో దాడి చేశాడు. పీకను కేసేశాడు. ఆయన దాడి చేసింది భార్యపై కాదు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిపైన. చీరాల బస్‌స్టాండ్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కారంచేడు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా బాలిగ శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. అతడి భార్య అదే ఊరిలో ఎల్‌ఐసీ కార్యాలయంలో పనిచేస్తోంది. అయితే అదే కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ సునీల్‌తో ఆమె అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం తెలిసి పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు శ్రీనివాసరావు. అయినా మంగళవారం ఇద్దరూ కలిసి బస్‌లో కనిపించడంతో తట్టుకోలేకపోయాడు. వెంటనే కత్తి తీసుకుని సునీల్ పీక కోశాడు. ఆయనను అడ్డుకోవడానికి యత్నించిన కానిస్టేబుల్ చేయి తెగిపోయింది. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరళించారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top