సినీ రంగంలో రాణించి ముంబయికి వచ్చి భోజ్‌పురీ సినిమాలో నటించి చివరకు వీధుల్లో బిచ్చగత్తెగా మారింది ఓ సినీనటి. ఢిల్లీకి చెందిన మిధాలీ శర్మకు సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా తానూ సినిమాలో హీరోయిన్ అవ్వానుకుంది. ముంబైకి వచ్చిన ఆమె అనుకున్నది సాధించింది. ఓ భోజ్‌పురీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమా విజయం సాధించలేదు. దీంతో ఆమెకు ఆ తర్వాత ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు.

తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేనని తనలో తాను కుమిలిపోయింది. ఆ కుంగుబాటే మానసిక ఒత్తిడికి కారణమైంది. చివరకు తినడానికి తిండి లేదు. ఏం తెలియాలో దిక్కుతోచని స్థితి. ఇక ఏ పని తనవల్ల కాదనుకుందో ఏమో కానీ ముంబయిలోని లొకండ్‌వాలా వీధుల్లో బిచ్చగత్తెగా మారింది. మానసికి ఒత్తిడితో పాటు ఆమెకు మతిస్థిమితం కూడా తోడైంది. దీంతో ఆమె ఒష్విరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న కారు అద్దాలను పగులగొడుతూ పోలీసుల కంట పడింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని గమనించిన లేడీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె కన్నీటి కథ వెలుగులోకి వచ్చింది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top