శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిస్టర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు, నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం మే 15 నుంచి స్పెయిన్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ''స్ర్కిప్ట్‌ చాలా బాగా వచ్చింది. డైలాగ్‌ వర్షన్‌ సిద్ధమవుతోంది. ప్రస్తుతం దర్శకుడు శ్రీనువైట్ల, రచయితలు గోపీమోహన్‌, శ్రీధర్‌ సీపాన ఊటీలో ఈ పనుల్లో ఉన్నారు. ఈ నెలాఖరున లాంఛనంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తాం. మే 15 నుంచి నెల రోజుల పాటు స్పెయిన్‌లో తొలి షెడ్యూల్‌ చేస్తాం'' అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ.జె.మేయర్‌, కెమెరా: జె.యువరాజ్‌, సమర్పణ: బేబీ భవ్య.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top